రాజ్యసభకు పార్థసారధి, దామోదర్‌రావు నామినేషన్

-

రాజ్యసభకు టీఆర్ఎస్ అభ్యర్థులు బండి పార్థసారధి రెడ్డి, దీవకొండ దామోదర్‌రావు నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో నామినేషన్లు దాఖలు చేశారు.

Rajya-Sabha
Rajya-Sabha

వచ్చే నెల 21వ తేదీ నుంచి తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ముగియనున్నాయి. ఈ మేరకు గత మంగళవారం నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. కాగా, రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా.. బండి పార్థసారధి, దామోదర్‌రావును జగిత్యాల ఎమ్మెల్యే బండి సంజయ్, పలువురు నేతలు కలిశారు. అనంతరం వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి.. శుభాకాంక్షలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news