జనసేనకు షాకిస్తూ మరో సీనియర్‌ నేత గుడ్‌బై…

-

జ‌న‌సేన‌కు, అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు విశాఖలో బిగ్‌ షాక్‌ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం పలువురు నేతలు జనసేనను వీడుతున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా మ‌రో నేత జ‌న‌సేన‌కు గుడ్ బై చెప్పారు. ఇసుక అంశంపై పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆదివారం నగరంలో లాంగ్‌ మార్చ్‌ చేపట్టిన సమయంలోనే ఆ పార్టీ సీనియర్‌ నేత పసుపులేటి బాలరాజు గుడ్‌బై చెప్పారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు పంపించారు పసుపులేటి.

జనసేనకు రాజీనామా చేసిన ఆయన ఈ సందర్బంగా పార్టీ అధినాయకత్వం తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జనసేనలో ప్రజాసమస్యలపై చర్చ జరగడం లేదని, ఆ పార్టీతో ప్రజాసమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు తక్కువ అని ఆయన తేల్చి చెప్పారు. ఇసుక కొరతను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా.. పవన్‌ కల్యాణ్‌ మార్చ్‌లు ఎందుకు చేపడుతున్నారని ప్రశ్నించారు. అలాగే ప్రజలకు ఉపయోగపడతానని భావించే పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నానని పసుపులేటి బాలరాజు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news