కోన‌సీమ గొడ‌వ‌లు ఉద్దేశ‌పూర్వకమే : పవన్‌ కల్యాణ్‌

-

కోన‌సీమ జిల్లా పేరు మార్పు నేప‌థ్యంలో జిల్లా కేంద్రం అమ‌లాపురంలో చోటుచేసుకున్న అల్లర్ల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంతో తాజా మీడియాతో మాట్లాడిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అమలాపురం అల్లర్లపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పార్టీ విస్తృత స్థాయి స‌మావేశం కోసం శుక్ర‌వారం విజ‌య‌వాడ వ‌చ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్ మీడియా ప్ర‌తినిధుల‌తో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా కోన‌సీమ గొడ‌వ‌లు ఉద్దేశ‌పూర్వ‌కంగానే జ‌రిగాయ‌ని ఆయ‌న సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు ప‌వ‌న్ క‌ల్యాణ్.

Pawan Kalyan: పల్నాడు రోడ్డు ప్రమాదంపై పవన్ కళ్యాణ్ ఆవేదన - NTV

జిల్లాల విభ‌జ‌న‌లో విరుద్ధ‌మైన విధానంలో వైసీపీ ప్ర‌భుత్వం ఉంద‌ని ఆరోపించారు ప‌వ‌న్ క‌ల్యాణ్. అల్ల‌ర్ల‌పై నిఘా విభాగానికి స‌మాచారం ఎందుకు రాలేద‌ని ప్ర‌శ్నించారు ప‌వ‌న్ క‌ల్యాణ్. గొడ‌వ‌లు జ‌రుగుతాయ‌ని ప్ర‌భుత్వానికి ముందే తెలుసున‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆరోపించారు. ఈ కార‌ణంగానే ఇప్ప‌టిదాకా పాల‌కులు అల్ల‌ర్ల‌పై స్పందించ‌లేద‌ని ధ్వ‌జ‌మెత్తిన ప‌వ‌న్ క‌ల్యాణ్.. స‌మ‌స్య అంబేద్క‌ర్ పేరు కాద‌న్న ప‌వ‌న్‌.. ఒక పార్టీలో రెండు వ‌ర్గాల మ‌ధ్య గొడ‌వే అల్ల‌ర్ల‌కు కార‌ణ‌మ‌ని అని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీలోని భిన్నాభిప్రాయాల‌ను తొక్కి అల్ల‌ర్ల‌ను రేపార‌ని ఆయ‌న ఆరోపించారు పవన్‌ కల్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news