చిరంజీవిని పిలిచి మరీ..అవమానించారు – జగన్‌ పై పవన్‌ కళ్యాణ్‌ సీరియస్‌

-

చిరంజీవిని పిలిచి మరీ..అవమానించారని సీఎం జగన్‌ పై పవన్‌ కళ్యాణ్‌ సీరియస్‌ అయ్యారు. ఆత్మగౌరవం చంపుకొని నేను ఎప్పుడూ ఏ పని చేయనని.. మెగాస్టార్ గా పిలుచుకునే చిరంజీవి సీఎం జగన్ అహంభావానికి గురైన వారేనని మండిపడ్డారు. చిరంజీవి లాంటి వ్యక్తి నమస్కారంపెడితే కనీసం నమస్కారం కూడా పెట్టని వ్యక్తి జగన్ అని ఫైర్ అయ్యారు.

మరి అలాంటి వ్యక్తి సామాన్యులకు ఎలాంటి గౌరవం ఇస్తాడో ప్రజలే అర్థం చేసుకోవాలని… కష్టపడి బతకడానికి కూడా మీకు నమస్కారాలు పెట్టాలి అంటే మా ఆత్మగౌరవం ఒప్పుకోవడం లేదని ఓ రేంజ్‌ లోనిప్పులు చెరిగారు.

వంగి వంగి దండాలు పెట్టి బతకాలి అంటే మా అస్తిత్వమే దెబ్బ తినే పరిస్థితి ఏర్పడుతుంది.. అందుకే భీమ్లా నాయక్ లాంటి సినిమాను సైతం వదిలేశానన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఇతరుల ఆత్మ గౌరవం దెబ్బతీయడానికి మీరెవరు..? మీకేమైనా కొమ్ములు ఉంటాయా.. దిగొచ్చారా? అని ప్రశ్నించారు. ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు.. వైసీపీకే ముఖ్యమంత్రి అని ఆగ్రహించారు పవన్ కళ్యాణ్.

 

Read more RELATED
Recommended to you

Latest news