వైసీపీకి బిగ్ షాక్..ఈ నెల 15న విశాఖకు పవన్ కళ్యాణ్

-

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్..విశాఖ టూర్‌ షెడ్యూల్‌ ఫిక్స్‌ అయింది. ఈ నెల 15వ తేదీన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విశాఖ వెళ్లనున్నారు. ఇందులో భాగంగానే, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టబోయే యాత్రకు సంబంధించిన ప్రత్యేక వాహనం సిద్ధమవుతోంది. ఈ వాహనాన్ని బుధవారం పవన్ కళ్యాణ్ గారు పరిశీలించారు. సాంకేతిక నిపుణులతో చర్చించి సూచనలు చేశారు.

అయితే.. పవన్‌ కళ్యాణ్‌ టూర్‌ పై వైసీపీ తీవ్ర స్థాయిలో ఫైర్‌ అవుతోంది. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా విశాఖపట్నంలో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్న,పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞాని అని మరోసారి నిరూపితమైందనీ మాజీ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు.

ఈనెల 15వ తేదీన విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ నిర్వహించే జనవాణి సభలపై కృష్ణాజిల్లా గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు.ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజావాణి పెట్టాల్సిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు చిల్లరకు ఆశ పడుతున్నాడని, పవన్ కళ్యాణ్ కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మూడు రాజధానులకు మద్దతు తెలపాలని కొడాలి నాని డిమాండ్ చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news