నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు జనసేనను విలీనం చెయ్యను – పవన్

-

నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు జనసేనను విలీనం చెయ్యనని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. కోనసీమ జిల్లా మండపేట కౌలు రైతు భరోసా యాత్ర బహిరంగ సభలో జనసేన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాజకీయ లబ్ది కోసం వాడుకోవాలని చూడటం వలనే అమలాపురం అల్లర్లకు కారణమన్నారు.

నా గెలుపు మీ చేతుల్లోనే ఉంది. గెలిచిన, గెలవకపోయిన ప్రజలకు అండగా ఉండి పోరాడతా. నిధులు వస్తాయనే పంచాయితీ ఎన్నికలు నిర్వహించారు. పంచాయితీ నిధులు దారి మళ్ళీంచి నిర్వీర్యం చేస్తున్నారు. జనసేన అధికారంలోకి వస్తే పంచాయితీలకు నిధులు ఇస్తాం. నిరుద్యోగుల ఉపాధి కోసం పది లక్షలు రూపాయలు వంతున రుణాలు ఇస్తామని ప్రకటించారు.

త్వరలోనే ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేస్తాం. 2024 ఎన్నికల్లో జనసేన గెలుపు ఖాయమని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. అన్న వస్తాడని వైసిపి నేతలూ మోసం చేశారు. అన్న వస్తాడు, మావయ్య వస్తాడని మాయ మాటలు ఎందుకు. వైసీపీ నేతల్లా నాకు కోట్లు లేవు. ప్రజల కష్టాలు తెలుసుకుని తీర్చాడానికి వచ్చా . రాజకీయ చైతన్యం కలిగిన తూర్పుగోదావరి జిల్లా నుండే మార్పు రావాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news