మా కుటుంబంలో నాని అభిమానులున్నారు..పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

-

నేచురల్ స్టార్ నాని నటించిన ‘అంటే సుందరానికి’ చిత్రం శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సినీ పరిశ్రమకు చెందిన దర్శకులు, నిర్మాతలు హాజరయ్యారు.

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు వివేక్ సాగర్ మ్యూజిక్ అందించగా, మైత్రీ మూవీ మేకర్స్ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా ఈ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కానుంది. ఇక ఈ ఈవెంట్ లో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

తనను మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాకు రావాలని ఆహ్వానించినందకు థాంక్స్ చెప్పారు. ఈ చిత్ర ఈవెంట్ లో తనకు సంబంధించిన ఏవీ వేయొద్దని చెప్పానని, అయినా వేశారని అన్నారు. అయితే, తన ఏవీ వేయకపోతే అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తారని అలా చేసినట్లున్నారని పేర్కొన్నారు.

నాని నటనతో పాటు తన వ్యక్తిత్వం తనకు చాలా ఇష్టమని, ఆయనకు భగవంతుడు గొప్ప విజయాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. తన కుటుంబంలో చాలా మంది నాని అభిమానులున్నారని తెలిపిన పవన్ కల్యాణ్..తెలుగు చిత్ర పరిశ్రమ అందరి సొత్తు అని చెప్పారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో గబ్బర్ సింగ్ ఫేమ్ హరీ శ్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్ర షూటింగ్ త్వరలో స్టార్ట్ చేస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news