మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలపై జగన్ ప్రభుత్వం నిఘా !

-

మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రభుత్వం నిఘా పెడుతోందంటూ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేలకు బుగ్గన ఇచ్చిన ల్యాప్ ట్యాపులను ఏ ఎమ్మెల్యే కూడా వాడటం లేదు… ఎందుకు ఆ ల్యాప్ ట్యాపులను వాడడం లేదో చెప్పగలరా..? అని నిలదీశారు పయ్యావుల కేశవ్.

మరాజకీయ నేతలు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులపై కూడా నిఘా పెట్టడం నిజం కాదా..? కేంద్ర ప్రభుత్వ సంస్థలచే ఎవరెవరిపై నిఘా పెట్టారనే దానిపై ఆడిట్ కు సిద్ధమా?
పెగాసెస్ విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో ఆరోపణలు చేయించడం కాదు.. రాతపూర్వకంగా సమాధానం ఇవ్వగలరా..? అని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ఎంక్వైరీకి సిద్ధమా? చంద్రబాబు ప్రభుత్వం పెగాసెస్ ఎక్విప్మెంట్ కొన్నారని అనవసపు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. పెగాసెస్ ఎక్విప్మెంట్ చంద్రబాబు కొనలేదని గౌతమ్ సవాంగ్ ఆర్టీఐ సమాధానం ఇచ్చారు. కేవలం అసత్య ప్రచారాలు, అభూత కల్పనలతో ప్రజల్ని నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చంద్రబాబు డేటా చౌర్యం చేశారని గతంలో అక్రమ కేసు పెట్టి దాన్ని నిరూపించడానికి అనవసరంగా ఉద్యోగస్థులను వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు పయ్యావుల కేశవ్.

Read more RELATED
Recommended to you

Latest news