ఏపీలో విద్యుత్‌ కోతలు లేవు – మంత్రి పెద్దిరెడ్డి

-

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అన్న వ్యాఖ్యలపై ఏపీ మంత్రి పెద్ది రెడ్డి స్పందించారు. ఏపీలో విద్యుత్‌ కోతలు లేవని…స్పష్టం చేశారు పెద్దిరెడ్డి. బొగ్గు అధికంగా కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక రోడ్లు బాగు పడ్డాయన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందునే కేటీఆర్‌ అలా మాట్లాడి ఉండొచ్చని చురకలు అంటించారు పెద్ది రెడ్డి.

ఏపీలో పరిస్థితి బాగాలేదు.. తెలంగాణలో అంతా బాగుందంటే ఓట్లు పడొచ్చని కేటీఆర్‌ భావించారేమోనని ఎద్దేవా చేశారు పెద్దిరెడ్డి. కరోనా సమయంలో వ్రేజల ఆరోగ్య, సామాజిక భద్రత విషయంలోనూ.. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధిలోనూ ఆంధ్రప్రదేశ్‌ దేశంలో అగ్రగామిగా ఉందని స్పస్టం చేశారు. కేటీఆర్‌ వ్యాఖ్యలకు వివరణగా నేను ఈ అంశాలు చెప్పడంలేదు.. వాస్తవాలను ప్రజలకు చెబుతున్నామన్నారు. దేశవ్యాప్తంగా విద్యుత్‌ సమస్య ఉంది. నిన్న మొన్నటి వరకూ తెలంగాణలోనూ విద్యుత్‌ కోతలు ఉన్నాయి. రోడ్లూ బాగోలేవని విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news