సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.. రాముడి లాంటోడు : పేర్ని నాని

-

సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.. రాముడి లాంటోడని అందుకే అందరూ ఆయనకు అండగా ఉన్నారని పేర్ని నాని పేర్కొన్నారు. రెండేళ్ళ కిందట వేరే కార్యక్రమంలో ఉండి వాణిజ్య ఉద్యోగుల సమావేశానికి రాలేకపోతే ఇప్పటికీ నా మీద ర్యాగింగ్ జరుగుతూనే ఉందని.. ఉద్యోగుల్లో చీలిక రాకుండా ఈ అసోసియేషన్ సమర్ధవంతంగా పనిచేస్తోందని వెల్లడించారు.

స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులందరికీ అభినందనలు చెప్పారు పేర్ని నాని. రాముడంతటి వాడికి కూడా ఎంతోమంది సహాయం చేశారని వెల్లడించారు. జగన్ అధికారంలోకి రావటానికి వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సహకారం కూడా ఉందని.. ఉద్యోగుల పై ప్రేమ ఉండబట్టే అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ 27 శాతం ఐఆర్ ఇచ్చారన్నారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత గానీ చంద్రబాబు ఖజానాకు ఎంత గండి పెట్టారో జగన్‌కు తెలియలేదని.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితే బాగోలేనప్పుడు పిఆర్సీ ఎలా బాగుంటుందని స్పష్టం చేశారు. మనసు లేక కాదు గతిలేకే పీఆర్సీ విషయంలో ప్రభుత్వం బేరాలు ఆడిందని.. చిన్న విషయాలను మనుసులో ఉంచుకోకుండా జగన్ ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news