ఏపీలో ముందస్తు ఎన్నికలు..పేర్ని నాని క్లారిటీ

-

 

ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు వస్తాయని గత కొన్ని రోజులుగా ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. తెలుగు దేశం పార్టీ, జనసేన పార్టీలు సైతం దీన్నే ప్రచారం చేస్తున్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలపై తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు.

‘ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు అనే సమస్య లేదు. ఇక్కడ ఉన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దేశంలో ఏ ఒక్క లీడర్ అయినా జగన్ లాంటి వారు ఉన్నారా అని ప్రశ్నించారు పేర్ని నాని.

ఏ పార్టీతో పొత్తు కోసం అయినా జగన్ వెంపర్లాడారా, జగన్ తత్వం ఉన్న నాయకుడు లేరు. ఆయనకు ఐదేళ్లు తమను పాలించమని ప్రజలు అధికారం ఇచ్చారు. దాని పూర్తి చేశాకే జగన్ మళ్ళీ ఎన్నికలకు వెళ్తారు. కచ్చితంగా సరైన సమయంలోనే ఏపీలో ఎన్నికలు జరుగుతాయి. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు’ అని పేర్ని నాని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news