పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలి: బుద్ధా వెంకన్న

-

పల్నాడులో టిడిపి కార్యకర్త కంచర్ల జల్లయ్య హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జల్లయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న క్రమంలో పోలీసులు బుద్ధా వెంకన్నను హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ కార్యకర్త హత్యకు గురికాగా వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న తమ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారని, కష్టకాలంలో ఉన్న వారిని ఓదార్చేందుకు వారికి తమ పార్టీ అండగా ఉంటుందని చెప్పడానికి వెళుతుంటే ఈ అక్రమ అరెస్టులు ఏంటి అంటూ బుద్దా మండిపడ్డారు.

ఏపీలో రౌడీ రాజ్యాన్ని సీఎం జగనే స్వయంగా ప్రోత్సహిస్తున్నారు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు లో ముగ్గురు టీడీపీ కార్యకర్తలు హత్యలకు గురి అయ్యారని, ఈ మూడు హత్యల వెనుక వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. అంతే కాకుండా ఇటువంటి ఘాతుకాలకు పాల్పడుతున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలని అన్నారు. డీజీపీగా గౌతమ్ సవాంగ్ ను మూడేళ్లు ఇష్టానుసారంగా వాడుకొని సాగనంపేసారని, రేపు ప్రస్తుత డిజిపి పరిస్థితి కూడా అదే అంటూ ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news