రైతులకు మోడీ సర్కార్ శుభవార్త.. జనవరి 1న పీఎం కిసాన్ నిధులు విడుదల

-

దేశంలోని రైతులందరికీ మోడీ సర్కార్ శుభవార్త చెప్పింది. కొత్త సంవత్సరం కానుకగా… అంటే జనవరి ఒకటో తేదీన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను దేశంలోని రైతుల ఖాతాల్లో విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు తొమ్మిది విడతల్లో.. పి ఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులను విడుదల చేసినట్లు… జనవరి 1వ తేదీ నుంచి పదో విడత డబ్బులు కూడా విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.

farmer

 

చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి కోసం ఆర్థిక సాయం అందించాలనే లక్ష్యం తోనే ఈ స్కీమ్ ని తీసుకు వచ్చారు.కాగా ఈ పథకం కింద కేంద్రం ఏటా రైతుల ఖాతాల్లో మూడు విడతలుగా ఆరు వేల రూపాయలు జమ చేస్తోంది దీనివల్ల దేశ వ్యాప్తం గా 12 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతోంది. ఇక ఈ పథకం డబ్బులను https://pmkishan.gov.in/ వెబ్ సైట్ లో చూసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news