నందమూరి తారకరత్న మరణం.. ప్రధాని మోదీ సంతాపం

-

సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. తాజాగా ప్రధాన మంత్రి మోదీ కూడా తారక్ మరణం పట్ల సంతాపం ప్రకటించారు. తారక్ మరణం తనను ఎంతో బాధించిందని ప్రధాని అన్నారు. ఈ మేరకు ట్విటర్‌ వేదిక సంతాపం వ్యక్తం చేశారు.

‘‘సినిమాలు, ఎంటర్‌టైన్‌రంగంలో తారకరత్న తనదైన ముద్రవేశారు. ఆయన మృతి నన్ను ఎంతో బాధించింది. తారకరత్న కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఓంశాంతి’’ అని ప్రధాని ట్వీట్‌ చేశారు.

మరోవైపు తారకరత్న భౌతికాయం హైదరాబాద్‌ చేరుకుంది. బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రి నుంచి ఆదివారం ఉదయం రంగారెడ్డి మోకిలలోని ఆయన నివాసానికి తారకరత్న పార్థివదేహాన్ని తరలించారు. తారకరత్నను కడసారి చూసేందుకు కుటుంబ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. తారకరత్న భౌతికదేహాన్ని చూసి, ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ముఖ్యంగా ఆయన కుమార్తె ‘నాన్నా.. నాన్నా’ అంటూ కన్నీటిపర్యంతమవుతుంటే, కుటుంబ సభ్యులు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news