బంగారు రాజదండం సెంగోల్‌ను అందుకున్న ప్రధాని మోదీ

-

నూతన పార్లమెంట్‌ భవనాన్ని రేపు ప్రధాని మోదీ ప్రారంభించునన్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే.. బంగారు రాజదండం సెంగోల్ ను ప్రధాని మోదీ అందుకున్నారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి ఒకరోజు ముందు ప్రధాని నరేంద్ర మోదీ మే 27వ తేదీ శనివారం ఢిల్లీలోని తన నివాసంలో మదురై పీఠాధిపతి అధినంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మదురై అధీనం 293వ ప్రధాన పూజారి ప్రధాని మోదీకి సెంగోల్‌ను బహుకరించారు. తిరువావడుతురై అధినం చెన్నై నుంచి మే 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాని మోదీని ఆయన నివాసంలో కలిసి ఘనంగా సత్కరించారు.

New Parliament building news Live Updates: PM Modi meets Adheenam seers at  his residence, receives 'Sengol' from them | India News,The Indian Express

అనంతరం మోదీకి సెంగోల్ ను బహూకరించారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ స్పీకర్ సీటు దగ్గర ‘సెంగోల్’ (రాజదండం) ఉంచుతారు.14 ఆగస్టు, 1947న, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ మొదటిసారిగా ఈ సెంగోల్‌ను అందుకున్నారు. ఇది బ్రిటీష్ వారి చేతుల నుండి అధికార మార్పిడికి చిహ్నంగా అభివర్ణించారు. అప్పటి మద్రాసులో సుప్రసిద్ధ నగల వ్యాపారి అయిన వుమ్మిడి బంగారు చెట్టి ఈ సెంగోల్‌ను రూపొందించారు. అద్భుతమైన రాజదండం సుమారు ఐదు అడుగుల పొడవు, పైభాగంలో ఒక ఎద్దు చెక్కబడి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news