కుక్కపై బాలయ్య కామెంట్ : మేము అరిచేవాళ్లం కాదు కరిచేవాళ్లం..!

-

ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. నాలుగు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా  శుక్రవారం ఉదయం నుంచి వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యే బాలకృష్ణ మొదటగా ఓటు వేశారు. అనంతరం ఆయన బయటకు నడుచుకుంటూ వెళుతుండగా ఆసక్తికర ఘటన చోటు చేసుకొంది. ఆ సమయంలో పక్కనే ఓ కుక్క మొరిగింది. దీంతో వెంటనే ఆయన దానిపై వ్యంగ్యంగా స్పందించారు. కుక్క అరుస్తోంది ఎందుకో…ఎవరికి ఎలా అర్ధమవుతుందో వారికి అదే భాషలో చెప్పాలి. మేము అరిచేవాళ్లం కాదు కరిచేవాళ్లం అంటూ డైలాగ్ చెప్పారు. దీంతో పక్కనే ఉన్నవారు పెద్దగా నవ్వడంతో ఈ సీన్ ఆసక్తికరంగా మారింది. ఆయన కేవలం కుక్క అరవడంపైనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా ? లేక మరేదైనా ఉద్దేశ్యంతో ఇలా అన్నారా ? అనే ఊహాగానాలు మొదలయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news