బొత్స సత్యనారాయణ ఇంట కరోనా కలకలం.. ఆ ఎమ్మెల్యేకి కూడా..!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి చాలా తీవ్రంగా ఉంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రతి రోజు కొత్తగా వందలాది కేసులు నమోదవుతున్నాయి. ప్రజానాయకులు సైతం దీని బారిన పడటంతో ఏపీలో ఆందోళన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. దీంతో ప్రజాప్రతినిదుల్లో భయం మొదలైంది.

తాజాగా తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబంలో కరోనా కలకలం రేపుతోంది. బొత్స మేనల్లుడు చిన్న శీను కరోనా బారిన పడ్డారు. దీంతో, ఆయనకు కాంటాక్ట్ లోకి వచ్చిన వారంతా ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో, ఆయన హోం క్వారంటైన్ కు వెళ్లిపోయారు. క్వారంటైన్ లోనే ఉండాలని తన  గన్ మెన్ కు కూడా ఆయన సూచించారు. దీంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లో భయాందోళన పరిస్థితులు ఏర్పడ్డాయి.

Read more RELATED
Recommended to you

Latest news