వైసీపీ నేతలను యాక్టివ్ చేసిన చంద్రబాబు.. వ్యూహం బెడిసి కొట్టిందా..?

-

సరిగ్గా వందరోజులు.. ఏపీ రాజకీయాల్లో ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. పార్టీ ఓటమి పాలవ్వడంతో కొందరు పార్టీకీ, నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు.. మరికొందరు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.. మాజీ మంత్రులు అంబటి, కాకాణి, పేర్ని నానిలాంటి వాళ్లు మాత్రమే బయటికొచ్చి మాట్లాడుతున్నారు.. ఆరు నెలల వరకు నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు తిరిగే ప్రసక్తే లేదని ప్రచారం నడిచింది.. కానీ అనుహ్యంగావైసీపీ నేతలు మీడియా ముందుకు వస్తున్నారు.. చంద్రబాబును తూర్పారపడుతున్నారు..

వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ కల్లీనెయ్యితో తయారుచేశారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.. దీనిపై వైసీపీనే టార్గెట్ గా నేతలు విమర్శలు గుప్పించారు.. వైసీపీ కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చింది.. చెయ్యని తప్పుకు ఎందుకు విమర్శలు పాలవ్వాలని అనుకున్న వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా బయటికి వస్తున్నారు.. అందరూ యాక్టివ్ అయి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు..

లడ్డూ వ్యవహారంపై చంద్రబాబు ఆరోపణలు చెయ్యకపోయి ఉంటే.. వైసీపీ నేతలు ఇప్పుడల్లా బయటికి వచ్చే వారు కాదని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతుంది.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వల్లే వైసీపీ నేతలు యాక్టివ్ అయ్యారని పార్టీ నేతలు చెబుతున్నారు.. ఈ వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకుని.. టీడీపీపై విమర్శలు చేసేందుకు దూరంగా ఉన్న వైసీపీ నేతలందరూ మీడియాకు ముందుకు వస్తున్నారు.. కీలక నేతలందరూ మీడియాలో కనిపిస్తూ ఉండటంతో ఆయా నియోజకవర్గాల క్యాడర్లో నయా జోష్ కనిపిస్తోంది..

నిన్న మొన్నటి వరకు రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, రోజాలు ఇప్పుడు యాక్టివ్ గా విమర్శలు చేస్తున్నారు.. ఇది క్యాడర్ లో కొంత ధైర్యాన్ని ఇచ్చే అంశంగా నేతలు చెబుతున్నారు. మొత్తంగా చంద్రబాబు ఇచ్చిన స్టేట్మెంట్ వైసీపీకి ప్లస్ అయిందని.. పొలిటికల్ సర్కిల్ లో డిస్కర్షన్స్ జరుగుతున్నాయి..

Read more RELATED
Recommended to you

Exit mobile version