‘ఫ్యాన్’ వార్: కృష్ణాలో ముంచేలా ఉన్నారు?

-

అధికార వైసీపీలో ఆధిపత్య పోరు రోజురోజుకూ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది…సాధారణంగా ఏ అధికార పార్టీలోనైనా ఆధిపత్య పోరు ఉంటుంది…అయితే వైసీపీలో మాత్రం కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది..ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏదొక నియోజకవర్గంలో నేతల మధ్య వార్ నడుస్తూనే ఉంది…నేతల మధ్య తగాదాలు జరుగుతూనే ఉన్నాయి..ప్రతిపక్ష నేతలపై విమర్శలు చేయాల్సిన వారు…ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ముందుకెళుతున్నారు.

అయితే వైసీపీ అధికారంలోకి వచ్చి…మూడేళ్లు అవుతుంది..ఈ మూడేళ్లలో గ్రూపు తగాదాలు పెరిగాయి తప్ప తగ్గలేదు..ఎక్కడకక్కడ నేతల మధ్య వార్ నడుస్తూనే ఉంది…ఈ ఆధిపత్య పోరు వల్ల పార్టీకే భారీ డ్యామేజ్ జరిగేలా ఉంది…గతలో టీడీపీ అధికారంలో ఉండగా ఇలాగే రచ్చ నడుస్తూ ఉండేది…సొంత నేతలే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే వారు..ఇలా ఆధిపత్య పోరు పెరగడం వల్ల…2019 ఎన్నికల్లో టీడీపీకి గట్టి దెబ్బే తగిలింది. ఇక ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీలో కూడా అదే సీన్ నడుస్తుంది…దీని ఎక్కడకక్కడ నేతల మధ్య వార్ ఉంది.

ఇక ఇటీవల కృష్ణా జిల్లాలో వైసీపీలో ఆధిపత్య పోరు బాగా ఎక్కువగా కనిపిస్తోంది…అసలు మొదట నుంచి గన్నవరంలో రచ్చ నడుస్తున్న విషయం తెలిసిందే…ఎప్పుడైతే టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీలోకి వచ్చారో..అప్పటినుంచి సీన్ మారిపోయింది…వంశీ వచ్చిన దగ్గర నుంచి వైసీపీలో రచ్చ జరుగుతూనే ఉంది…వంశీకి..యార్లగడ్డ వెంకట్రావుకు పడటం లేదు…అటు వంశీకి..దుట్టా రామచంద్రరావుకు వార్ నడుస్తోంది. అంటే వంశీకి వ్యతిరేకంగా యార్లగడ్డ, దుట్టాలు ఉన్నారు…ఇటీవల కాలంలో ఈ వార్ మరింత ముదిరింది…ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు.

ఇక మచిలీపట్నం నియోజకవర్గంలో కూడా ఈ ఆధిపత్య పోరు ఎక్కువగానే ఉంది..ఎమ్మెల్యే పేర్ని నాని, ఎంపీ బాలశౌరికి పడటం లేదు…ఇటీవల బహిరంగంగానే రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది..అలాగే పెడన నియోజకవర్గంలో కూడా నేతల మధ్య పోరు నడుస్తోంది…అటు కైకలూరులో అదే పరిస్తితి..ఇలా జిల్లాల్లో ఆధిపత్య పోరు పెరిగిపోతుంది. మరి ఈ పోరు వల్ల కృష్ణాలో వైసీపీకి ఎంత నష్టం జరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version