చంద్రబాబు ఉన్నప్పుడే తెలంగాణాలో 24 గంటల కరెంట్ వచ్చిందా…?

-

ఐటి కంపెనీలను దృష్టిలో పెట్టుకుని 24 గంటల కరెంట్ కోసం చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నప్పుడే జీవో తెచ్చారని… 24 గంటల విద్యుత్ లో కేసీఆర్ గొప్పతనం ఏమి లేదని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తెరాస సర్కార్ పై విమర్శలు చేసారు. ఒక మంత్రి అల్లుడి కంపెనీ ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ చేస్తోంది అని ఆయన మండిపడ్డారు.

రమ్మీ డాట్ కామ్ అడ్డా ద్వారా గ్యాంబ్లింగ్ నడుస్తోంది అని మండిపడ్డారు. ఓ మంత్రి వియ్యంకుడు గుట్కా వ్యాపారం చేస్తున్నారు అని విమర్శించారు. గుట్కా, మట్కా, వైన్, మైన్ అంతా ప్రభుత్వ పెద్దలు కనుసన్నల్లో నడుస్తోంది అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. వీటన్నింటికి కారణం ప్రశ్నించే గొంతు లేకపోవడమే అని, ప్రశ్నించే గొంతులను నలిపేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news