గుజరాత్ లో సీఎం కేజ్రీవాల్ పై దాడి

-

గుజరాత్​ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆయనపై గుర్తు తెలియని ఓ వ్యక్తి వాటర్ బాటిల్​ను విసిరాడు.  ఆ బాటిల్ కేజ్రీవాల్ తలపై నుంచి వెళ్లి పక్కన పడటం వల్ల ఆయనకు గాయాలేం కాలేదు. ఆప్ అధినేత రాజ్​కోట్​లో గర్బా కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఈ ఘటన జరిగింది.

మరోవైపు గుజరాత్ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రచారం ముమ్మరం చేసింది. అధికారంలోకి వస్తే గోసంరక్షణ కోసం నిధులు కేటాయిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ప్రతి గోవుకు రోజుకు రూ.40 ఇస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆప్ ఓట్లను చీల్చడానికి అధికార బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని విమర్శించారు. గుజరాత్​లో రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

“గుజరాత్​ ప్రయోజనాల కోసం ఆప్​కు ఓటు వేయండి. కాంగ్రెస్​కు ఓటు వేయడం వ్యర్థం. బీజేపీపై విరక్తి చెందిన చెందినవారందరూ ఆప్​కు ఓటేయండి. ప్రధాని మోదీ ప్రకటించిన రూ.20 వేల కోట్ల ప్యాకేజీ వల్ల.. కాంట్రాక్టర్లు, మంత్రులకు తప్ప ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదు. ప్రజలకు మెరుగైన విద్య, ఉద్యోగాలు, కరెంట్ కావాలి.”
— అరవింద్ కేజ్రీవాల్​, దిల్లీ ముఖ్యమంత్రి

Read more RELATED
Recommended to you

Exit mobile version