కేసీఆర్ కల నెరవేరింది.. మెడికల్ కాలేజీలకు పర్మిషన్‌పై హరీశ్ రావు హర్షం!

-

గతంలో కేసీఆర్ మంజూరు చేసిన మరో 4 మెడికల్ కాలేజీలకు కేంద్రం అనుమతులు ఇవ్వడంపై మాజీ మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు.బుధవారం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ.. యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ సహా గత నెలలో అనుమతి పొందిన ములుగు, నర్సంపేట్, గద్వాల్, నారాయణపేట్ మెడికల్ కాలేజీలు ఉన్న ప్రాంత ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.తాజా అనుమతులతో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ కల సాకారమైందని తెలిపారు.

sh rao

దీంతో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ అవతరించి, దేశంలోనే రికార్డ్ నెలకొల్పిందన్నారు.ఈ ఏడాదికి మొత్తం 8 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు గత కేసీఆర్ సర్కార్ నిధులు, భూ కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పర్మిషన్స్ ఇచ్చిందని గుర్తుచేశారు.కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 8 కాలేజీలకు గాను కేవలం నాలుగు మెడికల్ కాలేజీలకు మాత్రమే గత నెల ఎన్ఎంసీ నుంచి అనుమతులు వచ్చాయని విమర్శించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version