ప‌వ‌న్‌తో క‌లిసి స్వామివారిని ద‌ర్శించుకున్న నాదేండ్ల‌

-

Pawan Kalyan and Nadendla Manohar visit Tirumala
అమ‌రావ‌తి(తిరుమల): జనసేన అధినేత పవన్‌కల్యాణ్, మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ కలసి తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర‌స్వామి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాంగ్రెస్‌ పార్టీకి గురువార‌మే రాజీనామా చేసిన నాందెడ్ల మనోహర్‌ జనసేనలో చేరతున్నట్లు ప్రకటించనున్నారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు జిల్లా తెనాలి నుంచి జనసేన తరపున ఆయన పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news