కుప్పం ని టార్గెట్ చేసింది ఎవరు ? కథ ఎటువైపు వెళుతోంది ?

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొన్న నియోజకవర్గం కుప్పం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం. చంద్రబాబు రాజకీయాల్లో అడుగు పెట్టిన నాటి నుండి ఈ నియోజకవర్గం నుండి పోటీ చేస్తూ ఇప్పటిదాకా ఓడిపోకుండా గెలుస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం జగన్ అధికారంలోకి రావడంతో కుప్పం నియోజకవర్గాన్ని ముందు ని గట్టిగానే టార్గెట్ చేసినట్టు కొన్ని పరిణామాలు బట్టి అర్థం అవుతుంది.Jagan Mohan Reddy vs Chandrababu Naidu: Tussle takes a new turn ...రావటం రావటమే కుప్పం నియోజకవర్గాన్ని పురపాలక సంఘంగా మార్చటం జరిగింది. దానికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. చంద్రబాబు హయాంలోనే ఈ విధంగా జరగకపోవడంతో కుప్పం నియోజకవర్గ ప్రజలు ప్రస్తుత ప్రభుత్వం పనితీరుపై ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో తాజాగా జగన్ తన ప్రత్యర్థి చంద్రబాబుని కుప్పం నియోజకవర్గం సాక్షిగా పొలిటికల్ గా దెబ్బ కొట్టడానికి రెడీ అయ్యారు.

 

పూర్తి మేటర్ లోకి వెళ్తే కుప్పం కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లో భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్టు గుర్తించారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు తరపున కుప్పం నియోజకవర్గంలో అన్నీ దగ్గరుండి చూసుకునే పీఏ మనోహర్ హస్తం ఉన్నట్లు గుర్తించారు. దాదాపు ఈ స్కాం రెండు కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే చంద్రబాబు కుప్పం నియోజకవర్గం సాక్షిగా ఈ కేసులో బుక్ అవటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి. 

 

Read more RELATED
Recommended to you

Latest news