నవంబర్ 1 నుంచి 8వ తేదీ లోపు అందరూ జైలుకే – మంత్రి పొంగులేటి

-

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలోని ముఖ్యులపై ఫైల్స్ సిద్ధమయ్యాయి అని ఆయన బాంబు పేల్చడం జరిగింది. నవంబర్ ఒకటో తేదీ నుంచి నవంబర్ 8వ తేదీ లోపు అందరూ జైలుకే వెళతారని హెచ్చరించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తమ ప్రభుత్వం వద్ద పక్క ఆధారాలు ఉన్నాయని… గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలను కచ్చితంగా వెలికి తీస్తామని హెచ్చరించారు.

 

రెండు మూడు రోజుల్లోనే బాంబు లాంటి వార్త రాబోతుందని ఆయన తెలిపారు. దీపావళి కంటే ముందే పొలిటికల్ బాంబులు పేలుతాయని ఆయన… వ్యాఖ్యానించారు. ఒకటి రెండు రోజు ల్లోనే పొలిటికల్ బాంబులు పేలబోతున్నట్లు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎంతటి వాళ్ళైనా తప్పు చేస్తే తప్పించుకోలేరని ఆయన వ్యాఖ్యానించారు. పక్క ఆధారాలతో ఫైల్స్ అన్ని సిద్ధమయ్యాయి అని బాంబు పేల్చారు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version