తండ్రి, కొడుకుల కెరియర్ గాడిన పడే దెప్పుడో..!!

-

ఇప్పుడు పూరి జగన్నాధ్ మరియు ఆయన కొడుకు ఆకాష్ ఇద్దరూ ఒకే పరిస్థితి లో వున్నారు. చిన్నప్పటి నుండే నటిస్తున్న  ఆకాష్ కి ఇంకా సరైన సక్సెస్ లేకుండా పోయింది.`రీసెంట్ గా చోర్ బజార్` తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా కూడా అంచనాలు అందుకో లేకపోయింది. తనకి హిట్ అలాగే బాకీ వుంది.

అటు పూరి పరిస్థితి సరిగ్గా లేదు. ఇటీవల ఆయన తెరకెక్కించిన `లైగర్` రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయ్యింది. దాని తర్వాత బయ్యర్స్, ఫైనాన్సియర్స్ తో గొడవలు అయ్యి పోలీస్ కేసుల దగ్గరకు వెళ్ళింది. వారు కూడా ధర్నా చేయాలని, అలాగే పూరీ సినిమాలు బ్యాన్ చేయాలని కూడా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

ప్రస్తుతం ఆకాష్ కి చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. తనకు ఈ పరిస్థితులలో సినిమా  వచ్చే ఛాన్స్ కనపడటం లేదు. దీనికి  కారణం తన సొంత తప్పులా లేక తండ్రి ఎఫెక్ట్ పడుతుందా అర్ధం కాని పరిస్తితిలో వున్నాడు. ఇటు పూరి జగన్నాథ్ కు కూడా చేతిలో సినిమా లేదు. అటు వైపు బండ్ల గణేష్ కొడుకు కెరియర్ ను గాడి లో పెట్టడం లేదని పూరి పై ఓపెన్ గానే విమర్శలు చేశాడు. మరి ఎందుకో గాని పూరి జగన్నాథ్ కూడా కొడుకు సినిమా కు దర్శకత్వం వహించే అవకాశం కనపడటం లేదు. వీరి ఇద్దరి కి హిట్స్ వచ్చి మళ్లీ హల్చల్ చేయాలని కోరుకుంటున్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version