45 రోజుల పసికందు మృతదేహానికి పోస్టుమార్టం..!

-

సంగారెడ్డి జిల్లా హత్నూర (మం) కొన్యాలలో 45 రోజుల పసికందు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.  బాబు మృతికి కారణాన్ని తెలుసుకునేందుకు 10 రోజుల తర్వాత మృతదేహాన్ని బయటికీ తీసి పోస్టుమార్టం చేసారు డాక్టర్లు. ఈ నెల 5న సంగారెడ్డిలోని శిశురక్ష ఆస్పత్రిలో జ్వరంతో ఉన్న దష్విక్(45 రోజులు) ని అడ్మిట్ చేసారు తల్లిదండ్రులు అనురాధ, ప్రభులింగం. పరీక్షలు చేయగా చిన్నారికి డెంగ్యూ వచ్చిందని చెప్పారు వైద్యులు. ఈ నెల 8న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా.. నిలోఫర్ కి రిఫర్ చేసిన శిశురక్ష ఆస్పత్రి డాక్టర్లు.

నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా బాబు చనిపోయి 3 గంటలు అవుతుందని చెప్పడంతో ఇంటికి తీసుకెళ్లి ఖననం చేశారు  తల్లిదండ్రులు. మరునాడు తప్పుడు రిపోర్టులు ఇచ్చారని.. శిశురక్ష ఆస్పత్రి ల్యాబ్ ని సీజ్ చేశారు DMHO. దీంతో తమ బాబు మృతికి కారణమైన ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు పోస్ట్ మార్టం నిర్వహించారు వైద్యులు.

Read more RELATED
Recommended to you

Latest news