చిత్ర సీమలో మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ మృతి

-

చిత్ర సీమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మళయాళ నటుడు, కమెడియన్ ప్రదీప్ కొట్టాయం(61) మరణించారు. ఈ రోజు తెల్లవారుజామున గుండె పోటుతో మరణించినట్లు తెలుస్తోంది. మళయాళ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ కమెడియన్ గా నటిస్తున్నారు ప్రదీప్ కొట్టాయం. 2001 లో సినీ కెరీర్ ప్రారంభించ ప్రదీప్..70కి పైగా సినిమాల్లో నటించారు. ఎక్కువగా మళయాళ ఇండస్ట్రీలోనే పనిచేశారు. తెలుగులో గౌతంమీనన్ దర్శకత్వంలో నాగచైతన్య- సమంత జంటగా వచ్చిన ‘ ఏ మాయ చేశావే’ సినిమాలో హీరోయిన్ సమంత అంకుల్ పాత్రలో ‘ అంకుల్ జార్జ్’ పాత్రలో నటించారు. ఈ సినిమాతో తెలుగు తెరకు కూడా పరిచయం అయ్యారు. 

విపరీతమైన హాస్యం మరియు డైలాగ్ డెలివరీకి పేరుగాంచిన కొట్టాయం ప్రదీప్ ‘ఆడు ఒరు భీగర జీవి ఆను’, ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’, ‘లైఫ్ ఆఫ్ జోసుట్టి’, ‘కుంజిరామాయణం’, ‘వెల్‌కమ్ టు సెంట్రల్ జైలు’ వంటి మళయాళ సినిమాల్లో తన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ‘ ఆరట్టు’ సినిమాలో నటించారు. ఆయన మృతికి మళయాళ చిత్ర పరిశ్రమ సంతాపాన్ని వ్యక్తం చేసింది. ప్రముఖ నటులు మమ్ముట్టి, మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఆయన మృతికి సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news