కొత్త రాజధాని వాస్తవ పరిస్థితిపై శ్వేతపత్రం రిలీజ్ చేసేందుకు సన్నాహాలు

-

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిపై ఫుల్ ఫోకస్ పెట్టారు. అమరావతి వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ మేరకు అమరావతిపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు.

కాగా అమరావతిని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు దూకుడు పెంచారు. ప్రపంచంలో నాలుగో రాజధాని ఆంధ్ర ప్రదేశ్ కి ఉండాలని ఈ మేరకు సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. అధికారం చేపట్టిన వెంటనే అమరావతిలో అడుగు పెట్టి రాజధాని ఇదేననే క్షేత్రస్థాయిలో అమరావతి ప్రాంతంలో పర్యటించారు. అమరావతి రాజధానికి కట్టుబడి ఉంటామని ,అమరావతి విషయంలో గత ప్రభుత్వం ఏం చేసిందనేది ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా అమరావతి వాస్తవ పరిస్థితిపై శ్వేతపత్రం రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version