గుజరాత్‌లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించింది-ప్రధాని నరేంద్ర మోడీ

-

గుజరాత్‌లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించిందని దేశ ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే.. గుజరాత్‌ బీజేపీ టీమ్‌కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. గుజరాత్ లో బీజేపీ కోసం చాలా మంది కష్టపడ్డారని.. వారికి తాను రుణపడి ఉంటానని పేర్కొన్నారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ.

కాగా, గుజరాత్‌లో 1995లో 121 స్థానాలు గెలిచిన బీజేపీ, 1998లో 117 స్థానాల్లో విజయం సాధించింది. 2002లో 127 సీట్లు కైవసం చేసుకుంది.

2007లో 117 స్థానాల్లో గెలుపొందింది బీజేపీ పార్టీ. 2012లో 115 స్థానాలు గెలుచుకుంది. కానీ 2017లో 99కి పరిమితం అయింది భారతీయ జనతా పార్టీ. కానీ.. ప్రస్తుతం 150కి పైగా స్థానాల్లో విజయం వైపు దూసుకుపోతోంది బీజేపీ పార్టీ. దీంతో బీజేపీ పార్టీ నేతలు దేశ వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news