త్వరలోనే సినిమా షూటింగులు : దిల్‌ రాజు

-

గత 18 రోజులుగా సినిమా షూటింగ్‌లు బంద్‌ కొనసాగుతోంది. అయితే.. నేడు ఫిలిం చాంబర్‌లో కీలక సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ఫిలిం చాంబర్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)తో ఒప్పందం కుదుర్చుకున్నామని వెల్లడించారు. సినిమా నిర్మాణ వ్యయాలపై మరో రెండు మూడు రోజుల్లో చర్చించి త్వరలోనే ప్రకటన చేస్తామని తెలిపారు  దిల్ రాజు. ఫిలిం ఫెడరేషన్ తో ఉన్న సమస్యలు పరిష్కరించుకుంటున్నామని అన్నారు దిల్ రాజు. త్వరలోనే సినిమా షూటింగులు మొదలుపెడతామని పేర్కొన్నారు దిల్ రాజు. బాలీవుడ్ కూడా మన ఫిలిం ఇండస్ట్రీని గమనిస్తోందని వెల్లడించారు దిల్ రాజు.

Watch: Dil Raju Blames Media for All Confusion!

టాలీవుడ్ వాళ్లు షూటింగులు ఆపేసి ఏం చేస్తున్నారని బాలీవుడ్ వాళ్లు ఆరా తీస్తున్నారని వివరించారు దిల్ రాజు. అటు, దక్షిణాదిలోని ఇతర చిత్ర పరిశ్రమలు మన నిర్ణయాల కోసం ఎదురుచూస్తున్నాయని, ఇక, 8 వారాల తర్వాతే సినిమాలను ఓటీటీకి ఇవ్వాలని నిర్మాతలు నిర్ణయించారని వెల్లడించారు దిల్ రాజు. మల్టీప్లెక్స్ ల విషయంలో ధరలు అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్టు తెలిపారు. సింగిల్ స్క్రీన్ థియేటర్ లో టికెట్ ధరలు, వీపీఎఫ్ చార్జీలపై రేపు తుది నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పారు దిల్ రాజు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news