వాల్తేరు వీరయ్య విజయం తో బాబీ వద్దకు క్యూ కడుతున్న నిర్మాతలు.!

-

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య’ సినిమా 13 తేదీన థియేటర్స్ లో విడుదల అయ్యి సంచలన వసూళ్ళు రాబడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర లో నటించారు. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు.

ఈ సినిమా తో  చిరంజీవి వింటేజ్ లుక్ తో అదరగొట్టాడు మాస్ ఎలివేషన్స్, కామెడీ, యాక్షన్, డైలాగ్స్, సాంగ్స్ అదిరిపోయాయి. ఇక ఈ సినిమా ఇప్పటికి విడుదల అయ్యి 10 రోజులు అయినా  కూడా ఇంకా వసూళ్ళు వర్షం కురిపిస్తూనే ఉంది. ఇక ఇప్పటికే వాల్తేరు వీరయ్య సినిమా 3 రోజుల్లో 100 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. తాజాగా 10 రోజులకు 200 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి రికార్డ్ సృష్టించింది.

ఇక ఈ సినిమా తీసిన డైరెక్టర్ బాబీ ఈ బ్లాక్ బస్టర్ హిట్ తో చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు తనతో సినిమా చేసేందుకు టాలివుడ్ బడా నిర్మాతలు అందరూ తెగ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది అడ్వాన్స్ ఇవ్వబోగా ఆలోచించి చెబుతానని చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే తనని ఇంతగా నమ్మిన మైత్రీ మూవీ మేకర్స్ కు మరో ప్రోజెక్ట్ చేసి పెట్టేందుకు కు కూడా ఒకే అన్నాడని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news