టీచర్లకు కెసిఆర్ ప్రభుత్వం శుభవార్త.. బదిలీలపై కీలక ప్రకటన

-

టీచర్లకు కేసీఆర్ ప్రభుత్వం చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు మరియు పదోన్నతులపై సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని తాజాగా మంత్రి హరీష్ రావు తెలిపారు. టీచర్లకు బదిలీలు మరియు పదోన్నతులను సంక్రాంతి కానుకగా అందించాలని తాను సీఎం కేసీఆర్ ను కోరానని అందుకు ముఖ్యమంత్రి కూడా అంగీకరించారని వెల్లడించారు హరీష్ రావు.

త్వరలోనే దీనిపై కీలక ప్రకటన కూడా చేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే ముందుగానే ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు చెప్పారు హరీష్ రావు.ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కేంద్రం లో బి అర్ యస్ ఆవిర్భావ సన్నాహక సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు కరీంనగర్లో సింహ గర్జన సభ రాష్ట్ర రాజకీయాల ను మలుపు తెప్పింది.. తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చి రాష్ట్ర సాధనకు కారణమైందన్నారు. అలాంటి సభే ఖమ్మం జిల్లాలోను జరగబోతోందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news