మీ షాపుల్లో తుపాకులు పెట్టుకోండి.. బిజెపి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

-

ఉత్తరప్రదేశ్ లోని ముజిఫర్ నగర్ జిల్లాకు చెందిన కతౌలి బిజెపి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి వ్యాపారస్తుడు మీ, మీ షాపుల్లో తుపాకులు పెట్టుకోవాలని బిజెపి ఎమ్మెల్యే విక్రమ్ సైనీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు కేంద్ర సహాయ మంత్రి సంజీవ్ బాల్యాన్, ఎమ్మెల్యే విక్రమ్ సైనీలకు జన్సత్ తహసిల్ ప్రాంతంలోని వాజిద్పూర్ కావలి గ్రామంలో సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విక్రమ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు..

” మీ షాపుల్లో ఒకటి, రెండు పెట్టేల రాళ్లు, నాలుగైదు గడ్డపారలు, 2 పిస్టల్స్ పెట్టుకోండి. పోలీసులు ఎంత సేపు పని చేస్తారు. పోలీసులు ఎక్కడ ఉన్నారు. పోలీసులు వచ్చే సమయానికి సెట్ చేసుకున్నారు. మీ దుకాణాలు ఇంట్లో మంటల్లో ఉంటాయి”. అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. దీంతో వేదికపై ఉన్న ఇతర నాయకులు ఎమ్మెల్యేను ఆపే ప్రయత్నం చేయగా..

” నన్ను మాట్లాడనివ్వండి. వార్తాపత్రికల్లో ముద్రించండి, లేదా టీవీ లో చూపించండి. ఐదు సంవత్సరాల వరకు నన్ను ఎవరు తొలగించ లేరు. నాకు అంతకు మించి కోరికా లేదు” అని అన్నారు. ఉదయపూర్ ఘటనపై ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నుపుర్ శర్మ మాట్లాడినది ఆమె ప్రజాస్వామ్య హక్కు అని, హిందూ దేవతలకు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడే హక్కు ప్రజలకు ఉందా అని ప్రశ్నించారు. దీన్ని ఒక వ్యక్తి తన మొబైల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news