‘ఈ- గరుడ’ బస్సులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

-

ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు టీఎస్‌ఆర్టీసీ మరో అడుగు వేసింది. పర్యావరణహితమైన ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు ‘ఈ- గరుడ’ పేరుతో ప్రయాణికులకు అందుబాటులోకి వ‌చ్చాయి. 10 ఈ – గ‌రుడ బ‌స్సుల‌ను రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్‌, ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్, ఎండీ వీసీ స‌జ్జ‌నార్ జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను నడపాలని నిర్ణయించిన టీఎస్‌ఆర్టీసీ.. వీటిలో 10 బస్సులను మియాపూర్‌లో ప్రారంభించారు. మిగతా బస్సులు ఈ ఏడాది చివరినాటికి విడతలవారీగా అందుబాటులోకి రానున్నాయి.

హైటెక్‌ హంగులతో హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో 20 నిమిషాలకో ఈ- గరుడ బస్సు నడిపేలా ప్రణాళిక రూపొందించామని సంస్థ ప్రకటించింది. రెండేండ్లలో కొత్తగా 1,860 ఎలక్ట్రిక్‌ బస్సులను అందుబాటులోకి తెస్తామని తెలిపింది. ఈ సంద‌ర్భంగా ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ మాట్లాడుతూ.. హైద‌రాబాద్ – విజ‌య‌వాడ మ‌ధ్య ఇంట‌ర్ సిటీ బ‌స్సులు ప్రారంభించామ‌ని తెలిపారు. ఈ-గ‌రుడ బ‌స్సులో అత్యాధునిక సౌక‌ర్యాలు ఉన్నాయ‌ని వివ‌రించారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో త్వ‌ర‌లో ఎల‌క్ట్రిక్, డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సులు అందుబాటులోకి తెస్తామ‌న్నారు. త్వ‌ర‌లో 10 డ‌బుల్ డెక్క‌ర్, 550 ఎల‌క్ట్రిక్ బ‌స్సులు ప్రారంభిస్తామ‌ని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version