ఏపీ ముఖ్యమంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన ఆర్ నారాయణమూర్తి.. కారణం..?

-

ప్రముఖ నటుడిగా , నిర్మాతగా, దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్ నారాయణ మూర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. సామాజిక అంశాలపై దృష్టి పెడుతూ సమాజంలో జరిగే అన్యాయాలను ప్రతిఖండిస్తూ సినిమాల రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అందుకే ఆర్ నారాయణ మూర్తి తెరకెక్కించే ప్రతి సినిమా కూడా ప్రేక్షకులకు అతి చేరువలో ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. అయితే ఎంతగా సినిమాలు తెరకెక్కించినప్పటికీ ఆస్తిపరంగా మాత్రం ఈయన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదట. ప్రస్తుతం కూడా ఈయన అద్దె ఇంట్లో ఉంటున్నట్లు సమాచారం.


ఇక ఎంతోమంది ఈయనకు సహాయం చేయాలని చూసినప్పటికీ ఆయన మాత్రం ఎవరి సహాయం తీసుకోవడం లేదు. ఇక ఎప్పుడూ ప్రజలకు న్యాయం జరిగే విధంగా సమాజంలో పోరాడుతూనే ఉంటారు ఆర్.నారాయణమూర్తి. అందుకే ఆయనను అందరూ ప్రేమగా పీపుల్ స్టార్ అని పిలుస్తూ ఉంటారు. నారాయణమూర్తి ఇప్పటికీ కూడా సమాజానికై పాటుపడుతూ ప్రజలను సురక్షిత మార్గంలో నడిచేలా ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

అసలు విషయం ఏమటంటే..” కళా రంగంలో శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి జీవిత సాఫల్య పురస్కారం కే. విశ్వనాథ గారితో పాటు నాకు కూడా దక్కడం సంతోషంగా ఉంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ” అని ప్రముఖ దర్శక నిర్మాత , నటుడు ఆర్ నారాయణ మూర్తి తెలిపారు. “రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్పన్నమవుతున్న సమస్యలపై “అర్ధరాత్రి స్వతంత్రం” నుంచి సినిమాలు తీస్తున్న నన్ను పీపుల్స్ స్టార్ అని ప్రజలు అభిమానిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అంటూ ఆర్ నారాయణ మూర్తి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version