ప్రభాస్ ఫ్యాన్స్ కు షాక్… రాధేశ్యాం రిలీజ్ వాయిదా…?

-

కరోనా, ఓమిక్రాన్ కేసులు దేశంలో వేగంగా పెరుగుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా ఆంక్షలు సినిమాలను కూడా వాయిదా వేసేలా చేస్తున్నాయి. ముఖ్యంగా ప్యాన్ ఇండియా సినిమాకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ … ఈ నెల 7న విడుదల కావాల్సి ఉన్నా… కరోనా కారణంగా వాయిదా పడింది. దీంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.

ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్ కు కూడా షాకిచ్చే వార్త వినిపిస్తోంది. ప్రభాస్ నటించిన ఫ్యాన్ ఇండియా మూవీ ’రాధేశ్యాం‘ ని కూడా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరి 14న రాధేశ్యాం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా.. దీన్ని మార్చి 18న విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు దీన్ని ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు. రాధేశ్యాంలో ప్రభాస్ కు జోడీగా పూజాహెగ్డే నటిస్తోంది. పిరియాడిక్ లవ్ స్టోరీగా రాధేశ్యాంను డైరెక్టర్ రాధాక్రిష్ణ కుమార్ తెరకెక్కించాడు.

కరోనా కారణంగా పెద్ద సినిమాల విడుదలను వాయిదా వేస్తున్నారు. ఇప్పటికే ట్రిపుల్ ఆర్, వాయిదా పడగా.. ఇప్పుడు రాధే శ్యాం వంతు వచ్చింది. కరోనా కారణంగా చాలా రాష్ట్రాలు ఆంక్షల్లోకి వెళ్లాయి. చాలా రాష్ట్రాల్లో థియేటర్లను బంద్ చేశారు. మరికొన్ని రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను రన్ చేయాలని ప్రభుత్వాలు ఆదేశించాయి. ఈ కారణంగా కలెక్షన్లపై తీవ్రప్రభావం చూపనుంది. దీంతో వాయిదా వేయడమే మంచిదని నిర్మాతలు అనుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news