మార్చి మొదటి వారంలో ‘రాధేశ్యాం’ రిలీజ్..!

-

ఇండియా మోస్ట్ అవైటెడ్ మూవీ ‘రాధేశ్యాం’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్, పూజాహెగ్డే లీడ్ రోల్స్ లో చేసిన ప్యాన్ ఇండియా మూవీ రాధేశ్యాం జనవరిలోనే విడుదల కావాల్సి ఉన్నా… కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ రాధేశ్యాం థర్డ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. అయితే ఓటీటీలో రిలీజ్ చేస్తారని రూమర్లు వచ్చినా.. థియేటర్లలోనే రిలీజ్ ఉంటుందని మూవీ మేకర్లు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అయితే రాధేశ్యాంను మార్చి మొదటి వారంలో విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. బాహుబలి, సాహో తరువాత వస్తున్న.. రాధేశ్యాంపై భారీ అంచనాలు ఉన్నాయి. దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. రాధాక్రిష్ణ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే రాజమౌళి ప్యాన్ ఇండియా సినిమా ట్రిపుల్ ఆర్ కరోనా తీవ్రత పెరగడంతో.. సినిమాను వాయిదా వేశారు. ఈ సినిమాపై కూడా భారీగానే అంచానాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version