రఘునందన్ బిజెపి కండువా కప్పుకున్న టిఆర్ఎస్ నాయకుడు – వై.ఎస్ షర్మిల

-

దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల. దుబ్బాక నియోజకవర్గం లో ఆమె మాట్లాడుతూ.. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు బీజేపీలో ఉన్నట్లా?.. టిఆర్ఎస్ లో ఉన్నట్లా? అని ప్రశ్నించారు. రఘునందన్ రావు బిజెపి కండువా కప్పుకున్న టిఆర్ఎస్ నాయకుడంటూ విమర్శలు గుప్పించారు.

నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రఘునందన్ రావు విఫలమయ్యారని అన్నారు. మల్లన్న సాగర్ బాధితులకు ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇచ్చిన హామీ నెరవేర్చారా అంటూ ప్రశ్నించారు. నిరుద్యోగ భృతిపై కేసీఆర్ మెడలు పంచుతామని చెప్పి యువతను ఆకర్షించి ఓట్లు వేయించుకున్నారని.. ఈ సమస్యపై కనీసం ఏరోజైనా కొట్లాడారా అంటూ ప్రశ్నించారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గురించి రఘునందన్ రావు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని.. పావురాల గుట్టలో పావురంలో కలిసిపోయాడని అన్నారంట.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇస్తున్నానని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news