4 వేల కోట్ల భూములను తోట చంద్రశేఖర్ కు కేసీఆర్ ఇచ్చారు – రఘునందన్‌ రావు

-

బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు హాట్ కామెంట్స్ చేశారు. 4వేల కోట్ల రూపాయల మియాపూర్ భూములను తోట చంద్రశేఖర్ కు కేసీఆర్ అప్పగించారని ఆరోపణలు ఉన్నాయని..సోమేష్ కుమార్ కనుసన్నలోనే మియాపూర్ భూకుంభకోణం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం సభకు ఆర్థికవనరులు ఎక్కడ నుంచి వస్తున్నాయో చెప్పాలని.. ఉద్యమంలో రాక్షసులైన ఆంధ్రోళ్ళు ఇప్పుడు రక్తసంబంధీలు ఎలా అయ్యారో కేసీఆర్ చెప్పాలి? అని పేర్కొన్నారు.


తోట చంద్రశేఖర్ కు 40ఎకరాల మియాపూర్ భూములు కట్టబెట్టడంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పాత్ర ఉందని..సుఖేష్ గుప్తా వ్యవహారంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తోట చంద్రశేఖర్ విషయంలో సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని వెల్లడించారు. సర్వే నంబర్ 78లో జరుగుతోన్న అవకతవకలను సుప్రీంకోర్టు దృష్టతీసుకెళ్తామని.. 8ఎకరాలకు ఒక న్యాయం, 40ఎకరాలకు ఒక న్యాయమా? అని ప్రశ్నించారు.

మియాపూర్ భూముల రాష్ట్ర ప్రభుత్వం తమ విధానాన్ని ప్రజలకు తెలియజేయాలని..సర్వే 78లో 40ఎకరాల భూములను తోట చంద్రశేఖర్ కు చెందిన ఆదిత్య కస్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కేటాయించారన్నారు. బీహార్ నుంచి వచ్చిన అధికారులంటే కేసీఆర్ కు ప్రేమ ఎక్కవ అని..అందులో భాగంగానే బీహార్ కు చెందిన అధికారిని డీజీపీగా నియమించారని ఆగ్రహించారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు.

Read more RELATED
Recommended to you

Latest news