అసభ్య పదజాలంతో దూషిస్తున్నారంటూ.. విజయసాయిరెడ్డిపై ఎంపీ రఘురామ ఫిర్యాదు

-

వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ కు ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డి రాజకీయ ప్రముఖులను ట్విట్టర్ లో అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని రఘురామ తన ఫిర్యాదులో ఆరోపించారు రఘురామకృష్ణరాజు. విపక్షనేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ లపై విజయసాయిరెడ్డి దారుణమైన భాషతో పోస్టులు పెడుతున్నారని రఘురామ కృష్ణరాజు వివరించారు. విజయసాయి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తే ఇంకెన్నో అసహ్యకరమైన పోస్టులు కనిపిస్తాయని, విస్మయం కలిగించే అంశాలు బయటపడతాయని రఘురామకృష్ణరాజు తెలిపారు.

Raghurama Krishnam Raju shifted to jail after tests, doctors submit medical  reports to Guntur court

సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి దిగజారుడు భాష ఉపయోగిస్తున్న విజయసాయిరెడ్డి వంటి వ్యక్తి ఉన్నత పదవులకు తగడని స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డిని తక్షణమే ప్యానెల్ స్పీకర్ పదవి నుంచి, స్టాండింగ్ కమిటీ చైర్మన్, ఎథిక్స్ కమిటీ పదవుల నుంచి తప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రఘురామకృష్ణరాజు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ కు లేఖ రాశారు.

Read more RELATED
Recommended to you

Latest news