Breaking: వరంగల్ చేరుకున్న రాహుల్ గాంధీ

-

రైతు సంఘర్షణ యాత్రం కోసం రాహుల్ గాంధీ వరంగల్ చేరుకున్నారు. శంషాబాద్ ఏయిర్ పోర్ట్ నుంచి నేరుగా హెలికాప్టర్ ద్వారా వరంగల్ చేరుకున్నారు. శంషాబాద్ లో రాహుల్ గాంధీని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క రిసీవ్ చేసుకున్నారు. కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రాహుల్ గాంధీతో కలిసి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్కలు కూడా హెలికాప్టర్ లో వరంగల్ చేరుకున్నారు. హెలికాప్టర్ సెంట్ గాబ్రియెల్ స్కూల్ లో ల్యాండ్ అయిన తర్వాత అక్కడ నుంచి వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో సభాస్థలి వరకు ఓపెన్ టాప్ జీపులో ర్యాలీగా వెళ్లనున్నారు. తెలంగాణలో రైతుల సమస్యలపై రాహుల్ గాంధీ ముఖ్యంగా ప్రసంగించనున్నారు. వరంగల్ డిక్లరేషన్ ప్రసగించనున్నారు. రాహుల్ రాకతో ఓరుగల్లు నగరం మొత్తం కాంగ్రెస్ శ్రేణులతో సందడిగా మారింది. వరంగల్ కు వచ్చే అన్ని రహదారుల్లో కాంగ్రెస్ కార్యకర్తల సందడి కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version