తెలంగాణ జర్నలిస్టులను అవమానించిన రాహుల్ గాంధీ?

-

తెలంగాణ జర్నలిస్టులను రాహుల్ గాంధీ అవమానించారని వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి ఢిల్లీకి వెళ్లిన జర్నలిస్టులకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని సమాచారం. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలంగాణలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను… ఖండిస్తూ… రాహుల్ గాంధీని కలిసేందుకు ఢిల్లీలోని ఆయన నివాసానికి తెలంగాణ జర్నలిస్టులు వెళ్లడం జరిగింది.

rahul gandhi

అయితే ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ జర్నలిస్టులకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ కలవకపోవడంతో… పక్కనే ఉన్న ఏఐసీసీ కార్యాలయం కు తెలంగాణ జర్నలిస్టులు వెళ్లడం జరిగింది. అక్కడ తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను వివరించి… జంతర్ మంతర్ కు వెళ్లనున్నారు. జంతర్ మంతర్ వద్ద తెలంగాణ జర్నలిస్టులు ధర్నా కూడా చేయబోతున్నారని సమాచారం. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హల్చల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version