కొత్త పాస్ బుక్ లు వచ్చిన రైతులకు షాక్..ఈ సారి రైతు బంధు కట్ !

-

కొత్త పాస్ బుక్ లు వచ్చిన రైతులకు బిగ్‌ షాక్ తగులనుంది. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులకు ఈసారి రైతుబంధు సాయం అందే పరిస్థితి కనిపించడం లేదు. వ్యవసాయ అధికారులకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ వ్యవసాయ శాఖ ముఖ్య కమిషనర్ నుంచి వచ్చిన డేటాలో వారి వివరాలు లేవు.

యాసంగిలో పెట్టుబడి సాయం వస్తుందని ఆశపడ్డ కొత్త రైతులు ఇప్పుడు నిరాశలో ఉన్నారు. వానాకాలం సీజన్ లో రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు వెంటనే వారి ఖాతాలో నగదు జమ అయ్యింది. యాసంగిలోనూ అదే విధంగా వస్తుందని కొత్త పాస్ పుస్తకాలు పొందిన రైతులు ఆశపడ్డారు. కానీ, సిసిఎల్ఏ నుంచి సమాచారం రాకపోవడంతో అధికారులు సైతం ఏమీ చేయలేకపోతున్నారు. బ్యాంకు పాస్ పుస్తకం నంబర్ ను ఎంట్రీ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ వెబ్సైట్ ఓపెన్ కావడం లేదని అధికారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news