రాంగోపాల్ వర్మ దిక్కుమాలిన వ్యక్తి..తాగి ట్వీట్లు పెడతాడు – రాజా సింగ్

-

టాలీవుడ్‌ దర్శకుడు రాం గోపాల్‌ వర్మ పై బిజెపి పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రామ్ గోపాల్ వర్మ పనికి మాలిన వ్యక్తి అని.. అయన తాగి ట్వీట్స్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జీవీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని.. వార్తల్లో ఉండేందుకు వర్మ ప్రయత్నాలు చేస్తుంటాడని నిప్పులు చెరిగారు బిజెపి పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్.

ద్రౌపది ముర్ముపై వర్మ ట్వీట్ ను ఖండిస్తున్నానని.. ఆదివాసీ మహిళ రాష్ట్రపతిగా ఎన్నికకానున్న సమయంలో వర్మ ట్వీట్ బాధాకరమని పేర్కొన్నారు. తన తండ్రి ఏ ముఖం పెట్టుకుని దేశం తిరుగుతున్నాడో కేటీఆర్ చెప్పాలని.. కేటీఆర్ చేతకాని మంత్రి అంటూ విమర్శలు చేశారు బిజెపి పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్. కాగా, తాజాగా బీజేపీ పార్టీ నిలబెట్టిన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై సంచలన ట్వీట్‌ చేశారు ఆర్జీవీ. “ద్రౌపది రాష్ట్రపతి అయితే పాండవులు ఎవరు? మరి ముఖ్యంగా కౌరవులు అంటే ఎవరు? ” అంటూ సంచలన ట్వీట్‌ చేశారు వర్మ. అయితే.. దీనిపై బీజేపీ పార్టీ చాలా సీరియస్‌ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news