చెన్నై సూప‌ర్ కింగ్స్‌పై రాజ‌స్థాన్ ఘ‌న విజ‌యం

-

అబుధాబిలో సోమ‌వారం జ‌రిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2020 టోర్నీ 37వ మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌పై రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఘ‌న విజ‌యం సాధించింది. చెన్నై నిర్దేశించిన స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని రాజ‌స్థాన్ అల‌వోక‌గా ఛేదించింది. ఈ క్ర‌మంలో చెన్నైపై రాజ‌స్థాన్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.

rajasthan won by 7 wickets against chennai in ipl 2020 37th match

మ్యాచ్‌లో చెన్నై జ‌ట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో చెన్నై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి కేవ‌లం 125 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ల‌లో ఎవ‌రూ చెప్పుకోద‌గిన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేదు. కేవ‌లం జ‌డేజా మాత్ర‌మే జ‌ట్టును ఆదుకునే య‌త్నం చేశాడు. 30 బంతులు ఆడిన జ‌డేజా 4 ఫోర్ల‌తో 35 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మిగిలిన అంద‌రూ విఫ‌ల‌మ‌య్యారు. రాయ‌ల్స్ బౌల‌ర్ల‌లో ఆర్చ‌ర్‌, కార్తీక్ త్యాగి, ఎస్‌.గోపాల్‌, ఆర్‌.తెవాతియాల‌కు త‌లా 1 వికెట్ ద‌క్కింది.

అనంత‌రం బ్యాటింగ్ చేప‌ట్టిన రాజ‌స్థాన్ 17.3 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి 126 ప‌రుగులు చేసింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ల‌లో జాస్ బ‌ట్ల‌ర్ అర్ధ సెంచ‌రీతో రాణించాడు. 48 బంతులు ఆడిన బ‌ట్ల‌ర్ 7 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 70 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రాజ‌స్థాన్‌ను విజ‌య‌తీరాల‌కు చేర్చాడు. చెన్నై బౌల‌ర్లలో దీప‌క్ చాహ‌ర్ 2 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా హేజ‌ల్‌వుడ్‌కు 1 వికెట్ ద‌క్కింది.

Read more RELATED
Recommended to you

Latest news