రాజీవ్‌ స్వగృహాలు ఇంకా ఉన్నాయ్‌.. కావాలంటే దరఖాస్తు చేసుకోండి

-

హైదరాబాద్‌లో నాగోల్ సమీపంలో ఉన్న బండ్లగూడ, ఘట్ కేసర్ సమీపంలో ఉన్న పోచారం రాజీవ్ స్వగృహ టౌన్‌షిప్‌లలో మిగిలిన ప్లాట్లను వేలం వేసేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటి (హెచ్ఎండీఏ) అధికారులు సిద్ధమయ్యారు. గతంలో నిర్వహించిన వేలంలో అమ్ముడవకుండా మిగిలి ఉన్న అన్ని ఫ్లాట్లను మరోసారి వేలం వేసేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. రాజీవ్ స్వగృహ ప్లాట్లను గతంలో విక్రయించిన తెలంగాణ ప్రభుత్వం ఈసారి ఏకంగా టవర్లనే అమ్మకానికి పెట్టింది. హైదరాబాద్‌లోని పోచారం, గాజులరామారంలో పనులు పూర్తికాని రాజీవ్ స్వగృహ టవర్ల విక్రయానికి సంబంధించి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.

Hyderabad: Rajiv Swagruha leftover flats to be allotted through lottery -  Telangana Today

పోచారంలో నాలుగు, గాజుల రామారంలో 5 టవర్లను విక్రయించనున్నట్టు నోటిఫికేషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. పోచారంలో ఒక్కో టవర్‌లో 72 నుంచి 198 ఫ్లాట్లు ఉండగా, గాజుల రామారంలో ఒక్కో టవర్‌లో 112 ఫ్లాట్లు ఉన్నాయి. కొనుగోలుకు ఆసక్తి ఉన్న వ్యక్తులు, సంస్థలు టవర్ మొత్తం వ్యయంలో రెండు శాతం ఈఎండీ సమర్పించాలని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ తెలిపింది. ఈఎండీ సమర్పించేందుకు జనవరి 30ని చివరి తేదీగా పేర్కొంది. టవర్ల వివరాలు, పూర్తి సమాచారం కోసం www.hmda.gov.in, www.swagruha.telangana.gov.in ను సంప్రదించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news