పునీత్ రాజ్ కుమార్ కోసం రంగంలోకి రజినీకాంత్, ఎన్టీఆర్

-

పునీత్ రాజ్ కుమార్.. కన్నడిగులు ‘అప్పు’ అని ప్రేమగా పిలుచుకునే ఈ స్టార్ రాజ్ కుమార్ తనయుడిగా కన్నడ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా కొద్దికాలంలోనే తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. కన్నడ నాట పవర్ స్టార్‌గా ఎదిగాడు. హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఏర్పడి అందరి మన్ననలు ప్రేమ అందుకుంటూ అందనంత ఎత్తుకు ఎదుగుతున్న సమయంలో అకస్మాత్తుగా గుండె పోటుతో కన్నుమూశాడు. ఆయన మనందరిని వదిలి వెళ్లి నేటికి ఏడాది అయ్యింది.

హీరోగా ప్రేక్షకులను అలరించటమే కాదు సామాజిక సేవలోనూ అప్పు స్టారే. అంత మంచి వ్యక్తి గొప్పతనాన్ని గుర్తించిన కర్ణాటక ప్రభుత్వం పునీత్ రాజ్ కుమార్‌కు ‘కర్ణాటక రత్న’ అనే ప్రతిష్ఠాత్మకమైన బిరుదును ఇచ్చి గౌరవించింది.

నవంబర్ 1న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఈ బిరుదుని అధికారికంగా ప్రకటించనుంది కర్ణాటక సర్కార్. ఈ కార్యక్రమానికి పలు చిత్ర పరిశ్రమలకు చెందన అగ్ర హీరోలు హాజరు కానున్నారు. కోలీవుడ్ నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరు కాబోతున్నారు. ఇంకా ఇతర సినీ పరిశ్రమల నుంచి అగ్రహీరోలు హాజరుకానున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news