రకుల్ ప్రీత్ సింగ్‌ను ఈ సినిమాల్లో హీరోయిన్‌గా అనుకున్నారు..కానీ ఆ తర్వాత..!!

-

టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్..ప్రజెంట్ బాలీవుడ్ ప్రాజెక్ట్స్ లో ఫుల్ బిజీ గా ఉంది. ఇప్పటికే పలువురు టాలీవుడ్ స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించిన ఈ అమ్మడు..త్వరలో క్రేజీ ప్రాజెక్ట్స్ తో మళ్లీ తెలుగు లోకి రానుంది. కాగా, ఈ సుందరి..తెలుగులో సూపర్ హిట్ ఫిల్మ్స్ మిస్ అయింది.

ఆ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్స్ లో తొలుత హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ను అనుకున్నారట. కానీ, ఆ తర్వాత పలు కారణాల వలన వేరే వాళ్లను తీసుకున్నారట. ఆ సినిమాలు ‘పటాస్’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’. రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్స్ గా నిలిచాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన తొలి చిత్రం ‘పటాస్’లో తొలుత కథానాయికగా రకుల్ ప్రీత్ సింగ్ ను అనుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి చెప్పారు.

సినిమాలో హీరోయిన్ గా రకుల్ ను అనుకున్నానని, కానీ, బడ్జెట్ వలన శ్రుతి దోస్జను తీసుకున్నానని చెప్పుకొచ్చారు అనిల్. అలా ఆ సినిమా మిస్ అయింది. ఇక దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన ప్రభాస్ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ పిక్చర్ లో కాజల్ అగర్వాల్ పోషించిన పాత్రకు రకుల్ ను సెలక్ట్ చేశారు.

దశరథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రకుల్ ను ఈ పాత్ర కోసం షూట్ కూడా చేశారు. వారం రోజుల పాటు షూటింగ్ కూడా అయిందట. కానీ, ఆ తర్వాత ఆ పాత్రకు రకుల్ సరిపోవడం లేదని తీసేశారు. అలా రకుల్ ప్రీత్ సింగ్ రెండు సూపర్ హిట్ ఫిల్మ్స్ మిస్ చేసుకున్నట్లయింది.

Read more RELATED
Recommended to you

Latest news