ఆనంద్ మహీంద్రాకు శుభాకాంక్షలు తెలిపిన రామ్ చరణ్.. ఎందుకంటే..

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాను కలిశారు. హైదరాబాద్ లో ప్రారంభం కానున్న ఈ-ఫ్రీ లో పాల్గొంటున్న మహేంద్ర గ్రూపుకు రామ్ చరణ్ శుభాకాంక్షలు తెలుపుతూ ఆనంద్ మహేంద్ర ను కలిశారు..భారత్లో మొదటిసారిగా ఫార్ములా ఈ రేసింగ్ జరగబోతుంది. దీనికి హైదరాబాద్ మహానగరం ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.

అలాగే తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ఈ రేసును మొట్ట మొదటిసారిగా హైదరాబాద్లో నిర్వహించాలని పట్టుపట్టు మరీ జరిపిస్తున్నారు. ఈ రేస్ లో ఆనంద్ మహేంద్ర గ్రూప్ కూడా పాల్గొంటుంది మహేంద్ర గ్రూప్ గత రాత్రి ఫార్ములా-ఈ రేసింగ్‌లో పాల్గొనే తమ జనరేషన్-3 ఫార్ములా ఈ రేస్ కారును ప్రదర్శించింది. ఈ కార్యక్రమంలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాతో పాటు మంత్రి కేటీఆర్, హీరో రామ్ చరణ్ పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి టెక్ మహీంద్ర ఎండీ, సీఈఓ సీపీ గుర్నాని, ఆటో అండ్ ఫాం సెక్టార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జెజిరూకర్, కంపెనీ ఇతర సిబ్బంది హాజరయ్యారు.

ఈ సందర్భంగా రామ్ చరణ్ ఆనంద్ మహేంద్ర తో కాసేపు ముచ్చటించారు వీరితోపాటు కేటీఆర్ సైతం ఈ సంభాషణలో పాల్గొన్నారు.. అయితే దీనికి సంబంధించిన ఫోటోలను రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఆనంద్ మహీంద్రా ను సిపి గురునానీని కలుసుకోవడం అద్భుతంగా ఉందని తెలిపారు. అంతేకాకుండా ఫార్ములా-ఈ రేసింగ్‌లో విజయం సాధించాలని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే నగరానికి ఇలాంటి కార్యక్రమాలను తీసుకురావడానికి ఎంతో చొరవ చూపిస్తోన్న మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఆనంద్ మహీంద్రాను రామ్ చరణ్ కలిసిన ఫోటోల్లో ఆయన అయ్యప్ప స్వామి దీక్షలో కనిపించారు. కొన్ని రోజుల క్రితమే అయ్యప్ప మాలలో కనిపించిన రాంచరణ్ మళ్లీ ఈ మాల ధరించారు. అయితే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రామ్ చరణ్ కోసం చెబుతూ చరణ్ సంవత్సరంలో మూడు నాలుగు సార్లు ఏదో ఒక మాల ధరిస్తాడని ఆయనకు దైవ భక్తి చాలా ఎక్కువ అని చెప్పుకొచ్చారు. ఈ ఫోటోలు చూసిన రాంచరణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ మాటలను మరొకసారి గుర్తుతెచ్చుకుంటున్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version